ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మానవత్వంతో స్పందించా.. ఇలా అవుతుందనుకోలేదు

ABN, First Publish Date - 2021-12-03T05:29:46+05:30

కారు ప్రమాదం సంఘటన గురించి తెలిసిన వెంటనే తాను మానవతా దృక్పథంతో సాయమందించేందుకు కదిలానని దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్‌రావు స్పష్టం చేశారు.

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే రఘునందన్‌రావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 మృతుడి కుటుంబానికి అండగా ఉంటా

 తక్షణ సాయంగా రూ. లక్ష అందజేస్తా

దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు

దుబ్బాక, డిసెంబరు 2: కారు ప్రమాదం సంఘటన గురించి తెలిసిన వెంటనే తాను మానవతా దృక్పథంతో సాయమందించేందుకు  కదిలానని దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్‌రావు స్పష్టం చేశారు. కారు ప్రమాద ఘటనలో ఈతగాడు నర్సింహులు మృతి దురదృష్టకరమని, ఇలా అవుతుందనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబానికి తాను పూర్తి సహాయ సహకారాలందిస్తానని ఎమ్మెల్యే ప్రకటించారు. గురువారం రాత్రి దుబ్బాక క్యాంపు కార్యాలయంలో  విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. మృతుడు నర్సింహులు కుటుంబానికి తన వంతుగా మొదట రూ. లక్ష ప్రకటిస్తున్నట్టు తెలిపారు. అంతేగాక నర్సింహులు కూతురు పేరుతో మరో రూ.50 వేలను పెళ్లి ఖర్చులకు డిపాజిట్‌ చేస్తానని తెలిపారు. ఆ ఇద్దరు పిల్లల చదువును తానే దగ్గరుండి చూసుకుంటాననీ, ఆ కుటుంబానికి ప్రభుత్వం నుంచి రావల్సిన అన్ని సహాయాలను అందిస్తామన్నారు. బుధవారం రాత్రి మృతుడి కూతురుతో కూడా తాను మాట్లాడాననీ, తానే మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు నుంచి 30 హెచ్‌పీ మోటార్‌ తీసుకుని వచ్చి, నీటిని తోడేలా చర్యలు తీసుకున్నట్టు వివరించారు. ఈ సంఘటన తనకు బాధ కలిగించిందని, దీనిని రాజకీయం చేయాలనుకున్నవారి విజ్ఞతకే వదిలేస్తానన్నారు. 

Updated Date - 2021-12-03T05:29:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising