భక్తిభావంతో మానసిక ప్రశాంతత
ABN, First Publish Date - 2021-10-22T05:17:06+05:30
ప్రజల్లో భక్తిభావం పెంపొందినప్పుడే మానసిక ప్రశాంతత నెలకొంటుందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతారెడ్డి అన్నారు.
రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతారెడ్డి
హత్నూర, అక్టోబరు 21 : ప్రజల్లో భక్తిభావం పెంపొందినప్పుడే మానసిక ప్రశాంతత నెలకొంటుందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతారెడ్డి అన్నారు. గురువారం హత్నూర మండలం దౌల్తాబాద్లో నూతనంగా నిర్మించిన దుర్గాభవానీ ఆలయ విగ్రహ ప్రతిష్ఠాపనలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సునీతారెడ్డిని ఆలయ నిర్వాహకులు శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వెంకటేశం, ఎంపీటీసీ ఇందిరాసతీష్, ఆలయ నిర్వాహకులు కల్వ శ్రీనివాస్ ఉన్నారు. అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపనలో భాగంగా సాయంత్రం మహిళలు బోనాల ఊరేగింపు నిర్వహించారు.
Updated Date - 2021-10-22T05:17:06+05:30 IST