ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతులకు మేలు చేకూరాలన్నదే టీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయం: హరీష్

ABN, First Publish Date - 2021-06-24T17:42:41+05:30

రైతులకు మేలు చేకూరాలన్నదే సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని మంత్రి హరీష్‌రావు స్పష్టం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిద్ధిపేట: రైతులకు మేలు చేకూరాలన్నదే సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని మంత్రి హరీష్‌రావు స్పష్టం చేశారు. జిల్లాలోని చిన్నకోడూర్ మండలం చౌడారం గ్రామంలో రూ.3.53 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న బ్రిడ్జీ నిర్మాణ పనులకు జెడ్పీ చైర్మన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మతో కలసి మంత్రి హరీష్‌రావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ వానాకాలం 60 లక్షల 57 వేల 197 మంది రైతులకు రూ.7178 కోట్ల నగదును బ్యాంకు ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. రైతు ఎక్కడికీ తిరగకుండా పెట్టుబడి సాయం ఇచ్చిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదే అని అన్నారు. నెలకు వెయ్యి కోట్లు నిరంతర నాణ్యమైన విద్యుత్తు కోసం ప్రభుత్వం చెల్లిస్తున్నదని చెప్పారు. ఏడేండ్ల కింద 24 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం పండితే, ఈ యేడు 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండిందన్నారు. ఆయిల్ ఫామ్, మల్బరీ తోటలు-పట్టు సాగు, వరి వెద సాగు విరివిగా చేపట్టాలని పిలుపునిచ్చారు. పది తరాలు బాగుండాలంటే.. ప్రతీ గ్రామంలో కాల్వలు యుద్ధప్రాతిపదికన పూర్తి చేసేందుకు రైతులు సహకరించాలని మంత్రి హరీష్‌రావు కోరారు. 

Updated Date - 2021-06-24T17:42:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising