నేడు సంగారెడ్డిలో మంత్రి హరీష్రావు పర్యటన
ABN, First Publish Date - 2021-06-21T12:29:38+05:30
ఆర్థికమంత్రి హరీష్రావు ఈరోజు జిల్లాలో పర్యటించనున్నారు.
సంగారెడ్డి: ఆర్థికమంత్రి హరీష్రావు ఈరోజు జిల్లాలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా మంజీరా నదిపై మనూరు మండలం బోరంచలో బసవేశ్వర ఎత్తిపోతల పథకం సర్వే పనులను మంత్రి ప్రారంభించనున్నారు. బసవేశ్వర ఎత్తిపోతల పథకంతో నారాయణ ఖేడ్, అందోలు నియోజకవర్గాలకు సాగునీరు అందనుంది. మంత్రి హరీష్ పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
Updated Date - 2021-06-21T12:29:38+05:30 IST