రాష్ట్రస్థాయి జూనియర్ రగ్బీలో మెదక్ జిల్లాకు మూడో స్థానం
ABN, First Publish Date - 2021-11-30T04:55:37+05:30
ఈనెల 26 నుంచి 28 వరకు నల్గొండ జిల్లాలోని డాన్బాస్కో స్కూల్లో జరిగిన రాష్ట్రస్థాయి అండర్ 18 రగ్బీ జూనియర్ పోటీల్లో మెదక్ జిల్లా జట్టు మూడోస్థానంలో నిలిచింది
చేగుంట, నవంబరు29: ఈనెల 26 నుంచి 28 వరకు నల్గొండ జిల్లాలోని డాన్బాస్కో స్కూల్లో జరిగిన రాష్ట్రస్థాయి అండర్ 18 రగ్బీ జూనియర్ పోటీల్లో మెదక్ జిల్లా జట్టు మూడోస్థానంలో నిలిచింది. 5-0 స్కోర్తో మేడ్చల్ జిల్లా జట్టును ఓడించి కాంస్య పతకం సాధించింది. మెదక్ జిల్లా జట్టులో శ్రీవాణి, వాణి, నవీన, విజయ, సుజాత, గెస్సీల, చుకిత, స్వప్న, అఖిల, జ్యోతి, సునీత పాల్గొన్నారు. వీరిలో శ్రీవాణి, నవీన జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. అబ్బాయిల జట్టు నుంచి శ్రీకాంత్, నితిన్ జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారని కోచ్ కర్ణం గణేష్ రవికుమార్ తెలిపారు. వీరు వచ్చేనెల 10 నుంచి 13 వరకు ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్లో జరిగే జాతీయ స్థాయి రగ్బీ పోటీల్లో పాల్గొంటారని కోచ్ తెలిపారు. వీరి ఎంపికపై మెదక్ జిల్లా రగ్బీ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు రఘువీరారెడ్డి, మహేందర్, వెల్దుర్తి పీడీ ప్రతా్పసింగ్, రగ్బీ సీనియర్ ప్లేయర్స్ మోహన్, నరేష్ హర్షం వ్యక్తం చేశారు.
Updated Date - 2021-11-30T04:55:37+05:30 IST