ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కారును ఢీకొన్న లారీ.. పలువురికి తీవ్ర గాయాలు

ABN, First Publish Date - 2021-03-05T06:39:32+05:30

కారు లారీ ఢీకొని పలువురికి తీవ్రగాయాలైన ఘటన మండలంలోని చెట్ల నర్సంపల్లి గ్రామ సమీపంలో జరిగింది.

కారును లారీ ఢీకొన్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 దౌల్తాబాద్‌ మార్చి 4: కారు లారీ ఢీకొని పలువురికి తీవ్రగాయాలైన ఘటన  మండలంలోని చెట్ల నర్సంపల్లి గ్రామ సమీపంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. గజ్వేల్‌కు చెందిన రాజు అనే వ్యక్తి చేగుంటలో ఉంటున్న తన తల్లిదండ్రులు, చెల్లెలిని ఇంటికి తీసుకొచ్చేందుకు బుధవారం స్నేహితుడు భానుప్రసాద్‌తో కలిసి కారులో వెళ్లాడు. గురువారం సాయంత్రం తిరుగు ప్రయాణమయ్యారు. అదే సమయంలో చెట్ల నర్సంపల్లి గ్రామ సమీపంలో విజయవాడకు చెందిన ఓ లారీ ఎదుటి వైపు నుంచి వేగంగా  కారును ఢీకొట్టి సుమారు 100 మీటర్ల వరకు తోసుకుపోయింది.  ఈ సందర్భంగా కారులో ప్రయాణిస్తున్న  రాజు,  తండ్రి నర్సింహులు, తల్లి లక్ష్మి, చెల్లెలు కవిత, స్నేహితుడు భానుప్రసాద్‌లకు తీవ్రగాయాలయ్యాయి. వారిని వెంటనే 108 వాహనం ద్వారా గజ్వేల్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ చంద్రశేఖర్‌ తెలిపారు.

Updated Date - 2021-03-05T06:39:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising