సస్పెన్షన్కు గురైన కమిషనర్పై విచారణ
ABN, First Publish Date - 2021-10-31T04:02:45+05:30
పట్టణంలోని వీధికుక్కలను సాముహికంగా చంపించారంటూ వచ్చిన అభియోగంపై నర్సాపూర్ మున్సిపల్ కమిషనర్ అశ్రిత్కుమార్ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.
నర్సాపూర్, అక్టోబరు 30: పట్టణంలోని వీధికుక్కలను సాముహికంగా చంపించారంటూ వచ్చిన అభియోగంపై నర్సాపూర్ మున్సిపల్ కమిషనర్ అశ్రిత్కుమార్ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ శనివారం విచారణ ప్రారంభించారు. అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ మున్సిపల్ కార్యాలయానికి వచ్చి కుక్కలను చంపిన సంఘటనపై ఆరా తీశారు. ఈ మేరకు మున్సిపల్ కార్మికులు, సిబ్బంది, ఉద్యోగుల ద్వారా వివరాలను సేకరించారు. అనంతరం కుక్కలను పాతిపెట్టిన చోటుకు వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రతిమాసింగ్ విలేకరులతో మాట్లాడుతూ.. ఈ సంఘటనకు సంబంధించిన అన్ని అంశాలను విచారించి 15 రోజుల్లో నివేదికను ఇవ్వనున్నట్టు తెలిపారు. కాగా పలువురు బీజేపీ కౌన్సిలర్లు రాజేందర్, బుచ్చే్సయాదవ్తో పాటు టీఆర్ఎస్ నాయకులు భిక్షపతి, నగేష్, ఆంజనేయులుగౌడ్, దావుద్ తదితరులు మున్సిపల్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ను కలసి కమిషనర్ అశ్రిత్కుమార్కు కుక్కలను చంపిన విషయంలో ఏ మాత్రం ప్రమేయం లేదని చెప్పారు. విచారణ సమయంలో ప్రస్తుత కమిషనర్ చాముండేశ్వరీ కూడా ఉన్నారు.
Updated Date - 2021-10-31T04:02:45+05:30 IST