ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భూమి పట్టా మార్పిడిపై విచారణ

ABN, First Publish Date - 2021-09-04T03:50:12+05:30

పట్టా భూమిని అక్రమంగా మార్పిడి చేశారని మండలంలోని దమ్మక్కపల్లి గ్రామానికి చెందిన తోకల లక్ష్మి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ విషయంలో అధికారులు స్పందించి శుక్రవారం వివాదాస్పద భూమిపై విచారణ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 కొండపాక, సెప్టెంబరు 3: పట్టా భూమిని అక్రమంగా మార్పిడి చేశారని మండలంలోని దమ్మక్కపల్లి గ్రామానికి చెందిన తోకల లక్ష్మి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ విషయంలో అధికారులు స్పందించి శుక్రవారం వివాదాస్పద భూమిపై విచారణ చేశారు. అడిషనల్‌ కలెక్టర్‌ ముజామిల్‌ఖాన్‌, గజ్వేల్‌ ఆర్డీవో విజయేందర్‌రెడ్డి వెలికట్ట శివారులోని 335సర్వేనంబర్‌లోని భూమిని పరిశీలించారు. పట్టా ఎవరి పేరున ఉంది, ఎలా మారింది? అనే విషయాలను పరిశీలించారు. పట్టా మార్చుకున్న వెలికట్టకు చెందిన కిష్టయ్యను, బాధితురాలు లక్ష్మిని అధికారులు విచారించారు. అక్రమంగా పట్టా మార్పిడి జరిగినట్లు విచారణలో తేలితే చర్యలు తప్పవని ఆర్డీవో విజయేందర్‌రెడ్డి వెల్లడించారు. 


 

Updated Date - 2021-09-04T03:50:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising