రోడ్డు ప్రమాదంలో కృష్ణజింకకు గాయాలు
ABN, First Publish Date - 2021-06-18T05:03:47+05:30
మొగుడంపల్లి మండలంలోని మాడ్గి చెక్పోస్టు వద్ద గురువారం ఉదయం 65వ జాతీయ రహదారిపై రెండేళ్ల వయస్సున్న కృష్ణజింక రోడ్డు దాటుతున్న క్రమంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది.
జహీరాబాద్, జూన్ 17 : మొగుడంపల్లి మండలంలోని మాడ్గి చెక్పోస్టు వద్ద గురువారం ఉదయం 65వ జాతీయ రహదారిపై రెండేళ్ల వయస్సున్న కృష్ణజింక రోడ్డు దాటుతున్న క్రమంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. జింక ఎడమకాలు పూర్తిగా విరిగిపోవడంతో ఎటూ వెళ్లలేక నిస్సహాయ స్థితిలో రోడ్డుపై పడి ఉన్నది. మాడ్గి చెక్పోస్టు వద్ద విధులు నిర్వహిస్తున్న రెవెన్యూ సిబ్బంది గమనించి చిరాగ్పల్లిలో గల పశువైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స చేశాక అటవీశాఖ అధికారులకు జింకను అప్పగించారు. జహీరాబాద్ ఫారెస్ట్ రేంజ్ అధికారి విజయరాణి జింకను తీసుకొచ్చి జహీరాబాద్ సమీపంలో గల అర్బన్పార్కులో ఉంచారు. పూర్తిగా కోలుకునే వరకు తమ సంరక్షణలోనే ఉంటుందని తెలిపారు.
Updated Date - 2021-06-18T05:03:47+05:30 IST