పరిశ్రమలు, ప్రజల సహకారంతో అభివృద్ధి పనులు
ABN, First Publish Date - 2021-06-14T04:51:55+05:30
పరిశ్రమలు, ప్రజల సహకారంతో అభివృద్ధి పనులు నిర్వహించాలని ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి అన్నారు.
ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి
జిన్నారం, జూన్ 13: పరిశ్రమలు, ప్రజల సహకారంతో అభివృద్ధి పనులు నిర్వహించాలని ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి అన్నారు. గడ్డపోతారంలో పంచాయతీ కార్యాలయం నుంచి కట్ట మైసమ్మ ఆలయం వరకు రూ.21 లక్షల పరిశ్రమల సీఎ్సఆర్ నిధులతో నిర్మించిన డివైడర్, సీసీ రోడ్డును ఆదివారం ప్రారంభించారు. అనంతరం ఊట్లలో నిర్వహించిన గంగమ్మ జాతరలో పాల్గొన్నారు. ఆయనవెంట జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్, సర్పంచులు ప్రకాశంచారి, ఆంజనేయులు, ఎంపీటీసీ వెంకటేశంగౌడ్, వార్డు సభ్యులు, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజేశ్ ఉన్నారు.
Updated Date - 2021-06-14T04:51:55+05:30 IST