ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సాగుబాయి కుంటను పరిశీలించిన ఐబీ, రెవెన్యూ అధికారులు

ABN, First Publish Date - 2021-12-02T04:58:10+05:30

కొమురవెల్లి మండలం రసూలాబాద్‌ గ్రామ శివారులోని సాగుబాయికుంట స్థలాన్ని కొమురవెల్లి మండల నీటిపారుదల శాఖ ఏఈ రాజేందర్‌, రెవెన్యూ కార్యాలయ అధికారి సంజీవ్‌కుమార్‌ బుధవారం పరిశీలించారు.

స్థానికులతో మాట్లాడుతున్న ఐబీ ఏఈ రాజేందర్‌, రెవెన్యూ కార్యాలయ అధికారి సంజీవ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చేర్యాల, డిసెంబరు 1 : కొమురవెల్లి మండలం రసూలాబాద్‌ గ్రామ శివారులోని సాగుబాయికుంట స్థలాన్ని కొమురవెల్లి మండల నీటిపారుదల శాఖ ఏఈ రాజేందర్‌, రెవెన్యూ కార్యాలయ అధికారి సంజీవ్‌కుమార్‌ బుధవారం పరిశీలించారు. ఎన్నోఏళ్ల నుంచి కొనసాగుతున్న కుంటలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు లే అవుట్‌ కోసం మట్టి, మొర ం నింపి ఉనికి లేకుండా చేస్తున్న విషయం వివాదాస్పదమైంది. ఈ విషయమై వారు స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా అయినాపూర్‌ సర్పంచ్‌ చెరుకు రమణారెడ్డి, సీపీఎం మండల కార్యదర్శి శెట్టెపల్లి సత్తిరెడ్డి, మత్య్సకార సంఘం జిల్లా నాయకుడు తేలు ఇస్తారి, తాడూరి మల్లేశం అధికారులను కలిశారు. సాగుబాయికుంట ద్వారా 100 నుంచి 150 ఎకరాలు సాగు చేసుకుంటున్నారని, కుంట కనుమరుగుతో సాగు ఇబ్బందులతో పాటు మత్య్సకారులు చేపల పెంపకం లేక ఉపాధి కోల్పోవాల్సిన పరిస్థితి నెలకొన్నదన్నారు. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా అధికారులు పారదర్శకంగా విచారణ చేపట్టి కుంట హద్దులు నిర్ధారించి, ఆక్రమణకు గురికాకుండా పరిరక్షించేందుకు చర్యలు తీసుకోవాలని, లేకపోతే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. 

Updated Date - 2021-12-02T04:58:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising