వట్పల్లికి చేరిన గీతార్చన ప్రచారయాత్ర
ABN, First Publish Date - 2021-11-28T04:21:04+05:30
డిసెంబరు 14న హైదరాబాద్లో నిర్వహించే లక్ష యువ గీతార్చన ప్రచారయాత్ర జహీరాబాద్, నారాయణఖేడ్ మీదుగా శనివారం వట్పల్లికి చేరుకున్నది.
వట్పల్లి, నవంబరు 27 : డిసెంబరు 14న హైదరాబాద్లో నిర్వహించే లక్ష యువ గీతార్చన ప్రచారయాత్ర జహీరాబాద్, నారాయణఖేడ్ మీదుగా శనివారం వట్పల్లికి చేరుకున్నది. భజరంగ్దళ్ వట్పల్లి మండల శాఖ, విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో యాత్రకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్థానిక సర్వేశ్వరపురి పీఠాధిపతి అంబికా శివయాగి మాట్లాడుతూ లక్ష యువగళ గీతార్చనకు హిందూ బంధువులు హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి మెదక్ జిల్లా అఖండ కార్యదర్శి రాంరెడ్డి, జిల్లా కార్యదర్శి ద్వారక రవి, కోశాధికారి రాములు, భజరంగ్ దళ్ మండలాధ్యక్షుడు అరవింద్, మాజీ మండలాధ్యక్షుడు రాజు, లక్ష్మణ్, పాండు పాల్గొన్నారు.
Updated Date - 2021-11-28T04:21:04+05:30 IST