రైతుల స్వచ్ఛమైన పండగ ఏరువాక పౌర్ణమి
ABN, First Publish Date - 2021-06-24T04:50:18+05:30
రైతుల స్వచ్ఛమైన పండగ ఏరువాక పౌర్ణమి అని దైవజ్ఞశర్మ అన్నారు. బుధవారం మండల కేంద్రమైన మర్కుక్లో దైవాజ్ఞశర్మ ఆధ్వర్యంలో ఏరువాక పౌర్ణమి పండగను నిర్వహించారు.
దైవజ్ఞశర్మ
మర్కుక్, జూన్ 23: రైతుల స్వచ్ఛమైన పండగ ఏరువాక పౌర్ణమి అని దైవజ్ఞశర్మ అన్నారు. బుధవారం మండల కేంద్రమైన మర్కుక్లో దైవాజ్ఞశర్మ ఆధ్వర్యంలో ఏరువాక పౌర్ణమి పండగను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మర్కుక్లో వృషభాలను పూజించడం, నాగలిని ఆరాధించడం, రైతులను సత్కరించడం వంటి గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు ఆయన తెలిపారు. సీఎం కేసీఆర్ రైతులకు చేస్తున్న సేవలు వెలకట్టలేనివన్నారు. మండల రైతుబంధు కోఆర్డినేటర్ చంద్రశేఖర్రెడ్డి నాయకత్వంలో పండగను జరుపుకోవడం సంతోషంగా ఉన్నదని దైవజ్ఞశర్మ అన్నారు. కార్యక్రమంలో మండల రైతుబంధు కోఆర్డినేటర్ చంద్రశేఖర్రెడ్డి, మండల అగ్రికల్చర్ ఆఫీసర్ నాగేందర్రెడ్డి, వ్యవసాయ విస్తరణ అధికారి రజినీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2021-06-24T04:50:18+05:30 IST