ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆంజనేయుల కుటుంబాన్ని పరామర్శించిన ఈటెల రాజేందర్

ABN, First Publish Date - 2021-12-26T20:16:45+05:30

సీఎం కేసీఆర్ ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో ప్రమాదవశాత్తు మృతిచెందిన ఆంజనేయులు కుటుంబాన్ని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిద్దిపేట జిల్లా:  సీఎం కేసీఆర్ ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో ప్రమాదవశాత్తు మృతిచెందిన ఆంజనేయుల కుటుంబాన్ని హుజురాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ నాయకుడు ఈటెల రాజేందర్ పరామర్శించారు. రూ. 50 వేల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఈటెల మాట్లాడుతూ మత్స్యకార కుటుంబంలో పుట్టిన ఆంజనేయులు ఐదు నిమిషాల పాటు నీటిలో మునిగి ఉండగలడని అన్నారు. అలాంటి వ్యక్తి ఎలా చనిపోయాడో తేల్చాలన్నారు. ఇవాళ పోలీస్ పహారతో బెదిరించవచ్చు కానీ... తెలంగాణ సమాజం ఏ విధంగా స్పందించాలో అలా స్పందిస్తుందన్నారు. ఈ ప్రాంతంలో ముఖ్యమంత్రి ఉంటే రక్షణ ఉంటుందని భావించిన ప్రజలకు ఈ చర్య కళ్ళు తెరిపించిందన్నారు. ఈ ఫామ్ హౌస్ వచ్చిన తర్వాత ప్రజలకు రక్షణ కరువైందని, ఇంతకు ముందు పోలీస్ నిర్బంధాన్ని చవిచూడని ఈ ప్రాంతం నిత్యం పోలీసుల దౌర్జన్యాన్ని చూడాల్సి వస్తుందన్నారు. కేవలం చావు ఖర్చుల కోసం యాభై వేల రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకోవడం సిగ్గు చేటని ఈటెల రాజేందర్ మండిపడ్డారు.

Updated Date - 2021-12-26T20:16:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising