ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గణతంత్ర వేడుకల్లో జడ్పీటీసీ భర్త వర్సెస్‌ ఎంపీపీ మాటల యుద్ధం

ABN, First Publish Date - 2021-01-27T05:54:10+05:30

గణతంత్ర వేడుకల్లో మంగళవారం జడ్పీటీసీ పుష్పబాయి భర్త మోహన్‌రావు వర్సెస్‌ ఎంపీపీ కొంగరి జయశ్రీ మధ్య మాటల యుద్ధం జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మనూరు, జనవరి 26: గణతంత్ర వేడుకల్లో మంగళవారం జడ్పీటీసీ పుష్పబాయి భర్త మోహన్‌రావు వర్సెస్‌ ఎంపీపీ కొంగరి జయశ్రీ మధ్య మాటల యుద్ధం జరిగింది. అధికారుల సాక్షిగా టీఆర్‌ఎస్‌ గ్రూపు రాజకీయాలు గుప్పుమన్నాయి. మనూరు తహసీల్దార్‌ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన గణతంత్ర వేడుకలకు హాజరైన జడ్పీటీసీ భర్త మోహన్‌రావు.. ప్రొటోకాల్‌ పాటించడం లేదని అధికారులపై, పరోక్షంగా ఎంపీపీని కించపరిచే విధంగా మాట్లాడారు. స్పందించిన ఎంపీపీ జయశ్రీ.. ‘‘మేము ఎప్పుడూ ప్రొటోకాల్‌ను ఉల్లంఘించలేదు. గతంలో బెల్లాపూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో తాము పక్కనే ఉన్నా.. ప్రొటోకాల్‌ ఉల్లంఘించి జడ్పీటీసీ భర్తకు ఎలాంటి అర్హత లేకున్నా ప్రారంభోత్సవం చేశారు’’ అని బదులిచ్చారు. దీంతో ఇరు వర్గాల మధ్య కొద్దిసమయం మాటల యుద్ధం జరిగింది. దీంతో మనూరులో జరుగుతున్న గ్రూపు రాజకీయాలు అందరి సమక్షంలో బట్టబయలయ్యాయి.


Updated Date - 2021-01-27T05:54:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising