చికిత్స పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి మృతి
ABN, First Publish Date - 2021-07-27T03:59:37+05:30
చికిత్స పొందుతూ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
మెదక్ అర్బన్, జూలై 26: చికిత్స పొందుతూ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 17న జిల్లా కేంద్రంలో ఓ ప్రైవేట్బ్యాంక్ వద్ద అపస్మాకర స్ధితిలో పడి ఉన్న ఓ వ్యక్తిని చికిత్స నిమిత్తం 108లో జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించగా.. ఈ నెల 21నమృతి చెందినట్లు పట్టణ సీఐ తెలిపారు. సుమారుగా 50 ఏళ్ల వయస్సున్న మృతుడికి కోలముఖం, తెల్ల వెంట్రుకలు కలిగి నీలం రంగు షర్ట్ ధరించి ఉన్నట్టు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుడు కిరణ్రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు చెప్పారు. మృతుడి గురించి తెలిసినవారు 9490617045కు సమాచారాన్ని అందించాలని సీఐ కోరారు.
Updated Date - 2021-07-27T03:59:37+05:30 IST