బహిర్భూమికి వెళ్లిన వృద్ధుడు కుంటలో పడి మృతి
ABN, First Publish Date - 2021-03-01T05:24:22+05:30
బహిర్భూమికి వెళ్లిన వృద్ధుడు కుంటలో పడి మృతిచెందిన సంఘటన నస్కల్ నగరం తండాలో ఆదివారం చోటుచేసుకుంది.
నిజాంపేట, ఫిబ్రవరి 28: బహిర్భూమికి వెళ్లిన వృద్ధుడు కుంటలో పడి మృతిచెందిన సంఘటన నస్కల్ నగరం తండాలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. తండాకు చెందిన ముడావత్ రాజ్య(80) శనివారం మధ్యాహ్నం గ్రామ శివారులోని కోమటికుంట సమీపంలో బహిర్భూమికి వెళ్లాడు. ఈ క్రమంలోనే ప్రమాదవశాత్తు కోమటికుంటలో పడి మృతిచెందాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించి మృతదేహాన్ని రామాయంపేట ఆసుపత్రికి తరలించారు.
Updated Date - 2021-03-01T05:24:22+05:30 IST