రోడ్డుపై ధాన్యం నూర్పిళ్లతో పొంచి ఉన్న ప్రమాదం
ABN, First Publish Date - 2021-04-22T05:21:18+05:30
రోడ్లపై యథేచ్ఛగా ధాన్యం ఎండపోయడం, ఎగపోయడం చేస్తుండడంతో తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి.
చిల్పచెడ్, ఏప్రిల్ 21: రోడ్లపై యథేచ్ఛగా ధాన్యం ఎండపోయడం, ఎగపోయడం చేస్తుండడంతో తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతున్నా అధికారులు మాత్రం చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం రైతులకు కల్లాలు నిర్మించుకునేందుకు సబ్సిడీ ఇస్తుండగా కొంతమంది మాత్రమే వినియోగించుకుంటున్నారు. పెద్ద సంఖ్యలో రైతులు రోడ్లపైనే పంట నూర్పిళ్లు, ధాన్యం ఎండపోయడం చేస్తుండడంతో ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పగలు గాలికి దుమ్ము కళ్లలో పడి ద్విచక్రవాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. రాత్రిపూట పరిస్థితి మరింత ప్రమాదకరంగా ఉంది. రోడ్డుపై సగం వరకు ఆక్రమించిఽ ధాన్యం కుప్పలు చేస్తుండడంతో కార్లు, బైకులు ప్రమాదాలకు గురవుతున్నాయి. ఇటీవల జరిగిన ప్రమాదాల్లో పలువురు గాయపడ్డారు. కానీ అధికారులు మాత్రం ప్రమాధాలు జరిగినప్పుడు హడావుడిచేసి తరువాత పట్టించుకోవడం లేదని స్థాకులు ఆరోపిస్తున్నారు.
Updated Date - 2021-04-22T05:21:18+05:30 IST