ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్మార్ట్‌ ఫోన్‌ కొనివ్వలేదని..మనస్థాపంతో బాలిక ఆత్మహత్య

ABN, First Publish Date - 2021-07-28T05:53:15+05:30

స్మార్ట్‌ ఫోన్‌ కొనివ్వలేదని..మనస్థాపంతో బాలిక ఆత్మహత్య

త్రిష(ఫైల్‌)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొత్తగూడ, జూలై 27: స్మార్ట్‌ ఫోన్‌ కొనివ్వలేదని బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన మహబూబాబాద్‌ జిల్లా కొత్తగూడ మండలంలోని ఎదుళ్లపల్లి గ్రా మంలో మంగళవారం జరిగింది. స్థానిక ఎస్సై సురేష్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఎదుళ్లపల్లి గ్రామానికి చెందిన కూస సంపత్‌ రెండో కూతురు కూస త్రిష(16) ఇంటర్మీడియట్‌ చదువుతోంది. ఆన్‌లైన్‌ తరగతుల కోసం స్మార్ట్‌ ఫోన్‌ కొనివ్వమని తండ్రి సతీ్‌షను కోరింది. తరువాత కొనిస్తానని తండ్రి చెప్పడంతో త్రిష మనస్థాపం చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. వెంటనే నర్సంపేట ఏరియా ఆస్పత్రికి చికిత్స కోసం తీసుకెళ్లారు. కాగా, చికిత్స పొందుతూ మృతి చెందిందని ఎస్సై తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై సురేష్‌ తెలిపారు.

Updated Date - 2021-07-28T05:53:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising