ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మావోయిస్టు పార్టీ కీలక నేత కన్నుమూత

ABN, First Publish Date - 2021-06-13T19:49:28+05:30

మావోయిస్టు పార్టీ కీలక నేత కత్తి మోహన్ రావు అలియాస్ ప్రకాశన్న అలియాస్ దామ దాదా అనారోగ్యంతో మృతి చెందారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: మావోయిస్టు పార్టీ కీలక నేత కత్తి మోహన్ రావు అలియాస్ ప్రకాశన్న అలియాస్ దామ దాదా అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన కొంత కాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతూ జూన్ 10న ఉదయం 11.20 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు మావోయిస్టు పార్టీ ప్రకటన విడుదల చేసింది. కత్తి మోహన్ రావు మృతి పట్ల మావోయిస్టు పార్టీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.  


కత్తి మోహన్ రావు స్వస్థలం మహబూబాబాద్‌ జిల్లా భయ్యారం మండలంలోని గార్ల గ్రామం. మహబూబాబాద్‌లో ఇంటర్, ఖమ్మంలో డిగ్రీ, కాకతీయ యూనివర్సిటీలో ఎంఎస్సీ పీజీ పూర్తి చేశారు. డబుల్ గోల్డ్ మెడలిస్టు. 1982లో విప్లవ జీవితంలోకి ప్రవేశించారు. 1985లో ఆయన ఖమ్మంలో అరెస్ట్ అయ్యి ఆరేళ్లు జైలు జీవితం అనుభవించారు. అనంతరం బయటకు వచ్చిన ఆయన మళ్లీ విప్లవ జీవితాన్ని ప్రారంభించారు. ఆనాటి నుంచి అజ్ఞాత జీవితం గడుపుతున్నారు. దండకారణ్యంలో విప్లవ పాఠాలు బోధిస్తున్నారు. ఈ క్రమంలో అనారోగ్యంతో ఆయన కన్నుమూశారు. 

Updated Date - 2021-06-13T19:49:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising