ఢిల్లీలో గణతంత్ర వేడుకలకు మానుకోట మహిళ
ABN, First Publish Date - 2021-01-24T09:22:37+05:30
న్యూఢిల్లీలోని ఎర్రకోట వద్ద ఈనెల 26న నిర్వహించనున్న భారత గణతంత్ర వేడుకల్లో పాల్గొనేందుకు మహబూబాబాద్ జిల్లాలోని మారుమూల గడ్డిగూడెం వాసి భూక్య లక్ష్మికి అవకాశం లభించినట్లు జిల్లా గిరిజన సంక్షేమ
మహబూబాబాద్ రూరల్, జనవరి 23 : న్యూఢిల్లీలోని ఎర్రకోట వద్ద ఈనెల 26న నిర్వహించనున్న భారత గణతంత్ర వేడుకల్లో పాల్గొనేందుకు మహబూబాబాద్ జిల్లాలోని మారుమూల గడ్డిగూడెం వాసి భూక్య లక్ష్మికి అవకాశం లభించినట్లు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారులు శనివారం తెలిపారు. వివిధ రాష్ట్రాలు, ప్రాంతాల సంస్కృతిని ప్రతిబింబిస్తూ కొనసాగే పరేడ్లో గిరిజన బంజారా సంస్కృతి విభాగంలో లక్ష్మి పాల్గొననుంది. ట్రైబల్ రీసెర్చ్ అండ్ కల్చరల్ అధికారులు లక్ష్మితో పాటు ఇవే వేడుకల్లో ఆదిలాబాద్ నుంచి ఆదివాసీ విభాగానికి ఎంపికైన కాత్లే మారుతి, లైజన్ అధికారిగా గిరిజన సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డి.సుధాకర్ను శుక్రవారం రాత్రి ఢిల్లీకి పంపించారు.
Updated Date - 2021-01-24T09:22:37+05:30 IST