భార్య కాపురానికి రావడం లేదని భర్త ఏం చేశాడంటే..
ABN, First Publish Date - 2021-04-11T18:20:04+05:30
భార్య కాపురానికి రావడం లేదని సురేష్ అనే వ్యక్తి జిల్లా కేంద్రంలో మొబైల్ టవర్ ఎక్కి నిరసన తెలిపాడు.
మంచిర్యాల: భార్య కాపురానికి రావడం లేదని సురేష్ అనే వ్యక్తి జిల్లా కేంద్రంలో మొబైల్ టవర్ ఎక్కి నిరసన చేపట్టాడు. భార్య కాపురానికి వస్తేనే కిందికి దిగుతానని.. లేకుంటే దూకుతానని బెదిరిస్తున్నాడు. ఆదివారం ఉదయం నుంచి పోలీసులు టవర్ వద్ద పడిగాపులు కాస్తున్నారు. అయితే తనను మోసం చేసిన వ్యక్తితో కాపురం చేయనని భార్య తేల్చి చెప్పింది. యాదాద్రి జిల్లా జనగామకు చెందిన సురేష్.. పట్టణానికి చెందిన యువతిని 8 ఏళ్ల క్రితం ప్రేమవివాహం చేసుకున్నాడు. పూర్తి వివరాలు అందవలసి ఉంది.
Updated Date - 2021-04-11T18:20:04+05:30 IST