ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భార్యను కడతేర్చిన భర్త

ABN, First Publish Date - 2021-04-21T05:45:45+05:30

భార్యను కడతేర్చిన భర్త

సంఘటనా స్థలంలో లక్ష్మి మృతదేహం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అయ్యప్ప దేవాలయం ఆవరణలో హత్య

కుటుంబ కలహాలే కారణం

మహదేవపూర్‌, ఏప్రిల్‌ 20 : భార్యను భర్త హత్య చేశాడు. అయ్యప్ప దేవాలయం ఆవరణలో హతమార్చి పోలీ్‌సస్టేషన్‌లో లొంగిపోయాడు. ఈ సంఘటన భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌లో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... జిల్లాలోని గణపురం మండలం వెంకట్రావుపల్లె గ్రామానికి చెందిన బండారి ఓదెలు సింగేణి ఉద్యోగి. భూపాలపల్లిలోని యేటింక్లైన్‌లో పంప్‌ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. ఇద్దరు భార్యలు లక్ష్మి (55), సుగుణతో కలిసి వెంకట్రావుపల్లెలోనే నివాసం ఉంటున్నాడు. మొదటి భార్యకు నలుగురు కుమార్తెలు, రెండో భార్యకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. కొద్ది రోజులుగా కుటుంబంలో మనస్పర్థలు చోటుచేసుకున్నాయి. ఇద్దరు భార్యలు, ఓదెలు పరస్పరంగా గొడవపడుతున్నారు. ఇవి సద్దుమణగాలంటే కాళేశ్వరం వెళ్లి పూజలు చేయాలని ఎవరో సలహా ఇవ్వడంతో మొదటి భార్య లక్ష్మితో కలిసి ఓదెలు అక్కడికి బయల్దేరాడు. మూడు రోజులు అక్కడే ఉండి పూజలు నిర్వహించారు. మంగళవారం స్వగ్రామానికి తిరిగి వెళ్తూ మహదేవపూర్‌లోని అయ్యప్పస్వామి ఆలయం వద్ద ఆగి భోజనం చేశారు. ఈ క్రమంలోనే భార్యాభర్తల మఽధ్య వాదోపవాదాలు మొదలయ్యాయి. మాటామాట పెరగడంతో కోపోద్రిక్తుడైన ఓదెలు కర్రతో లక్ష్మి తలపై బలంగా కొట్టాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఆ తర్వాత ఓదెలు మహదేవపూర్‌ పోలీ్‌సస్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. ఎస్సై అనిల్‌ కుమార్‌ కేసు నమోదు చేశారు.


Updated Date - 2021-04-21T05:45:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising