మయూర వాహనంపై మల్లన్న విహారం
ABN, First Publish Date - 2021-03-08T08:53:51+05:30
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజు ఆదివారం భ్రమరాంబ సమేత మల్లికార్జునుడు మయూర వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.
శ్రీశైలం, మార్చి 7: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజు ఆదివారం భ్రమరాంబ సమేత మల్లికార్జునుడు మయూర వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా అలంకార మండపంలో సుగంధపుష్పాలతో అలంకరించిన మయూర వాహనంపై ఉత్సవమూర్తులను అధిష్టింపజేశారు. గంగాధర మండపం వద్ద ప్రత్యేక పూజాదికాలను నిర్వహించి క్షేత్రవీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు. శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జునులకు కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి దేవస్థానం తరపున ఆలయ ఈవో ఎ.వెంకటేష్, తిరుమల తిరుపతి దేవస్థానం తరుపున ఈవో డాక్టర్ కెఎ్స.జవహర్ రెడ్డి ఆదివారం సాయంత్రం పట్టువస్త్రాలు సమర్పించారు.
Updated Date - 2021-03-08T08:53:51+05:30 IST