పీయూ అసిస్టెంట్ ప్రొఫెసర్కు యంగ్ సైంటిస్ట్ అవార్డు
ABN, First Publish Date - 2021-06-17T05:11:05+05:30
పాలమూరు యూనివర్శిటీ మైక్రోబయాలజీ అసి స్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ శాంతిప్రియకు మైక్రోబయాలజీ ఆఫ్ ఇండియా ప్రతియేటా ఇచ్చే యంగ్ సైంటిస్ట్ అవార్డు దక్కింది.
- ఆన్లైన్ ద్వారా అవార్డు స్వీకరించిన డాక్టర్ శాంతిప్రియ
- అభినందించిన వైస్ చాన్స్లర్ లక్ష్మీకాంత్ రాథోడ్
పాలమూరు యూనివర్శిటీ, జూన్ 16 : పాలమూరు యూనివర్శిటీ మైక్రోబయాలజీ అసి స్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ శాంతిప్రియకు మైక్రోబయాలజీ ఆఫ్ ఇండియా ప్రతియేటా ఇచ్చే యంగ్ సైంటిస్ట్ అవార్డు దక్కింది. ఈ అవార్డును ఆమె బుధవారం ఆన్లైన్ ద్వారా స్వీకరిం చారు. ఈ సందర్భంగా బుధవారం యూనివర్శిటీలో జరిగిన కార్యక్రమంలో వైస్ఛాన్స్లర్ ప్రొఫె సర్ లక్ష్మీకాంత్ రాథోడ్ ఆమెను సన్మానించి, అభినందించారు. ఈ కార్యకమ్రంలో రిజిస్ట్రార్ పవన్ కుమార్, ఓఎస్డీ మధుసూదన్ రెడ్డి, ప్రిన్సిపాల్ నూర్జహాన్ బేగం, ఈసీ మెంబర్ ప్రొఫెసర్ గిరిజామంగ తాయారు పాల్గొన్నారు.
Updated Date - 2021-06-17T05:11:05+05:30 IST