ఘనంగా ఎల్లమ్మ రథోత్సవం
ABN, First Publish Date - 2021-03-07T05:56:10+05:30
నారాయణపేట జిల్లా కోస్గి మండలం పోలే పల్లి గ్రామంలో శనివారం రేణుకా ఎల్లమ్మ రథోత్సవాన్ని ఘనంగా నిర్వ హించారు.
కోస్గి రూరల్, మార్చి 6 : నారాయణపేట జిల్లా కోస్గి మండలం పోలే పల్లి గ్రామంలో శనివారం రేణుకా ఎల్లమ్మ రథోత్సవాన్ని ఘనంగా నిర్వ హించారు. మూడు రోజులు కొనసాగిన అమ్మవారి జాతరలో చివరి రోజు అమ్మవారి విగ్రహాన్ని రథంలో ఉంచి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయిం చారు. కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శిం చుకున్నారు. అంతకుముందు పలువురు నాయకులు అమ్మవారికి ప్రత్యేక పూజాలు చేశారు. కార్యక్రమంలో ఈవో రాజేదంర్రెడ్డి, ఆలయ చైర్మన్ వెంకటేష్ పాల్గొన్నారు.
Updated Date - 2021-03-07T05:56:10+05:30 IST