ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు చేస్తాం: కలెక్టర్‌

ABN, First Publish Date - 2021-05-22T05:05:12+05:30

లాక్‌డౌన్‌ జిల్లాలో పకడ్బందీగా అమలు చేస్తామని కలెక్టర్‌ ఎల్‌పీ.శర్మన్‌ వెల్లడించారు.

వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జిల్లా కలెక్టర్‌ ఎల్‌పీ.శర్మన్‌, ఎస్పీ డా.వై.సాయిశేఖర్‌, వైద్యాధికారి డా.సుధాకర్‌లాల్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాగర్‌కర్నూల్‌, మే 21 (ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్‌ జిల్లాలో పకడ్బందీగా అమలు చేస్తామని కలెక్టర్‌ ఎల్‌పీ.శర్మన్‌ వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. నేటి నుంచి మరింత పకడ్బందీగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. జిల్లాలో ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని, జిల్లాలో కేసులు పెరగడానికి కారణాలు తెలుసుకొని నియంత్రణ కు మరింత చర్యలు తీసుకుంటామని వివరించారు. ప్రస్తుతం జిల్లాలో 8321 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, ఇంటింటి సర్వే మొదటి దశ పూర్తి కాగా రెండవ దశ సైతం పూర్తి చేయడం జరిగిందని ముఖ్యమంత్రికి వివరించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఎస్పీ డా.వై.సాయిశేఖర్‌, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.సుధాకర్‌లాల్‌, ఆసుపత్రి సూపరిం టెండెంట్‌ డా.శివరాం, డా.రోహిత్‌, డా.నిఖి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-22T05:05:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising