ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తడిసిన ప్రతీ గింజను కొనుగోలు చేస్తాం

ABN, First Publish Date - 2021-05-17T04:21:56+05:30

తడిసిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని వ్యవసాయ మార్కెట్‌ చైర్‌పర్సన్‌ పురం లీలావతిరెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మార్కెట్‌ చైర్‌పర్సన్‌ లీలావతి

ఆత్మకూరు, మే 16: తడిసిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని వ్యవసాయ మార్కెట్‌ చైర్‌పర్సన్‌ పురం లీలావతిరెడ్డి అన్నారు. శనివారం రాత్రి భారీ వర్షం కురిసిన కారణంగా మండలంలోని ఆయా గ్రామాలలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు రవికుమార్‌ యాదవ్‌తో కలిసి వ్యవసాయ మార్కెట్‌లో తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. ఈ సం దర్భంగా చైర్మన్‌ మాట్లాడుతూ రవాణా అంతరాయం కారణంగా గన్ని బ్యాగులు అందలేదని, దీంతో కొనుగోలు కేంద్రాలలో ధాన్యం నిలిచిపోవడం వాస్తవమేనని తెలిపారు. మక్తల్‌ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి జిల్లా సివిల్‌ సప్లై అధికారులతో సంప్రదింపు లు జరిపారని, ఆయన ఆదేశాల మేరకు మండలానికి 25వేల గన్ని బ్యాగులు త్వరలో రానున్నాయని తెలిపారు. అదేవిధంగా రవాణా వేగవంతం చేసి రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి మండల నాయకులు విష్ణువర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు.



Updated Date - 2021-05-17T04:21:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising