ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఏకగ్రీవ ఎన్నిక

ABN, First Publish Date - 2021-04-23T04:32:49+05:30

అలంపూరు మునిసిపాలిటీ పరిధిలోని ఐదో వార్డు కౌన్సిలర్‌గా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎరుకలి లక్ష్మీదేవి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

లక్ష్మీదేవికి ధ్రువీకరణ పత్రాన్ని అందిస్తున్న ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి కరుణాకర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

    అలంపూర్‌, ఏప్రిల్‌ 22 : అలంపూరు మునిసిపాలిటీ పరిధిలోని ఐదో వార్డు కౌన్సిలర్‌గా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎరుకలి లక్ష్మీదేవి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆమె టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ఒకటి, స్వతంత్ర అభ్యర్థిగా మరొక నామినేషన్‌ను దాఖలు చేశారు. ఇతరులెవరూ నామినేషన్‌ దాఖలు చేయలేదు. స్వతంత్ర అభ్యర్థిగా వేసిన నామినేషన్‌ను లక్ష్మీదేవి బుధవారం ఉపసంహరించుకున్నారు. దీంతో ఆమె ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి కరుణాకర్‌ గురువారం ప్రకటించి, ధ్రువీకరణ పత్రాన్ని అందించారు. కార్యక్రమంలో మునిసిపల్‌ కమిషనర్‌ జి.రాజు, వైస్‌ చైర్మన్‌ శేఖర్‌ రెడ్డి, చైర్‌పర్సన్‌ మనోరమ వెంకటేష్‌, కౌన్సిలర్లు సుదర్శన్‌ గౌడ్‌, ఆలయ మాజీ చైర్మన్‌ నారాయణరెడ్డి, ధర్మకర్త వెంకటరామయ్య శెట్టి, నాయకులు ఎరుకలి సత్యం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-23T04:32:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising