రాత్రి కర్ఫ్యూపై అవగాహన కల్పించాలి
ABN, First Publish Date - 2021-04-23T04:39:55+05:30
కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో జిల్లా అంతటా విధించిన రాత్రి కర్ఫ్యూపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఎస్పీ జే.రంజన్ రతన్కుమార్ తమ శాఖ అధికారులు, సిబ్బందికి సూచించారు.
- ఎస్పీ జే.రంజన్ రతన్కుమార్
గద్వాల టౌన్, ఏప్రిల్ 22 : కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో జిల్లా అంతటా విధించిన రాత్రి కర్ఫ్యూపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఎస్పీ జే.రంజన్ రతన్కుమార్ తమ శాఖ అధికారులు, సిబ్బందికి సూచించారు. బుధవారం రాత్రి ఆయన పట్టణంలో బుల్లెట్పై తిరుగుతూ కర్ఫ్యూ అమలు తీరును పర్యవేక్షించారు. పౌరులతో సున్నితంగా వ్యవహరించాలని సిబ్బందికి సూచించారు. ఆ సమయంలో రోడ్లపై కన్పించిన పౌరులతో మాట్లాడారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని సూచించారు. ప్రతి ఒక్కరూ విధిగా మాస్కు ధరించాలని, కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఉన్నవారు తగిన గుర్తింపు కార్డులను దగ్గర ఉంచుకోవాలన్నారు.
Updated Date - 2021-04-23T04:39:55+05:30 IST