చెంచులకు మెరుగైన వైద్యం అందించాలి
ABN, First Publish Date - 2021-03-09T04:40:46+05:30
అగ్నిప్రమాదంలో గాయపడిన చెంచులకు మెరుగైన వైద్యం అందించాలని నాగర్కర్నూల్ ఎంపీ రాములు అన్నారు. నల్లమల అడవిలో ప్రమాదవ శాత్తు మంటల్లో చిక్కుకొని గాయపడినవారిని ఉస్మానియా ఆస్పత్రిలో సోమవారం ఆయన పరామర్శించారు.
నాగర్కర్నూల్ ఎంపీ రాములు
అచ్చంపేటటౌన్, మార్చి 8 : అగ్నిప్రమాదంలో గాయపడిన చెంచులకు మెరుగైన వైద్యం అందించాలని నాగర్కర్నూల్ ఎంపీ రాములు అన్నారు. నల్లమల అడవిలో ప్రమాదవ శాత్తు మంటల్లో చిక్కుకొని గాయపడినవారిని ఉస్మానియా ఆస్పత్రిలో సోమవారం ఆయన పరామర్శించారు. అనంతరం వైద్యులతో మాట్లాడారు. అదేవిధంగా గాయపడిన వారిని ప్రభుత్వపరంగా ఆదుకుంటామన్నారు. ఆయన వెంట సూపరింటెండెంట్ కృష్ణ ఉన్నారు.
Updated Date - 2021-03-09T04:40:46+05:30 IST