765 మందికి పాజిటివ్
ABN, First Publish Date - 2021-04-24T05:03:11+05:30
ఉమ్మడి పాలమూరు జిల్లాలో శుక్రవారం 765 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.
మహబూబ్నగర్(వైద్యవిభాగం)/ హన్వాడ/ గద్వాల టౌన్/ కందనూలు/ నారాయణపేట క్రైం, ఏప్రిల్ 23 : ఉమ్మడి పాలమూరు జిల్లాలో శుక్రవారం 765 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. అందులో మహబూబ్నగర్ జిల్లాలో అత్యధికంగా 275 కేసులు నమోదయ్యాయి. నాగర్కర్నూల్ జిల్లాలో 260 మందికి వైరస్ సోకింది. జోగుళాంబ గద్వాల జిల్లాలో 133 మందికి, నారాయణపేట జిల్లాలో 97 మంది కరోనా బారిన పడ్డారు.
- మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండలం వేపూర్ గ్రామంలో కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకు ఎక్కువవుతుండడంతో గ్రామస్థులు స్వచ్ఛందంగా లాక్డౌన్ ప్రకటించుకున్నారు. గ్రామంలో ఇప్పటికే 19 మంది వైరస్ బారిన పడడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు గ్రామ కార్యదర్శి జ్ఞానేశ్వర్ తెలిపారు. బయటి వారు ఎవరూ గ్రామంలోకి రావద్దని కోరారు. ఉదయం, సాయంత్రం రెండు గంటల పాటు కిరాణం దుకాణాలు తెరచి ఉంటాయని పేర్కొన్నారు.
Updated Date - 2021-04-24T05:03:11+05:30 IST