విద్యుదాఘాతంతో ఒకరి మృతి
ABN, First Publish Date - 2021-07-25T04:06:16+05:30
మండల కేంద్రంలోని బొగ్గులబట్టీలో శనివారం రాత్రి విద్యుదాఘాతంతో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది.
తెలకపల్లి, జూలై 24: మండల కేంద్రంలోని బొగ్గులబట్టీలో శనివారం రాత్రి విద్యుదాఘాతంతో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించి గ్రామస్థుల కథనం ప్రకారం... బిజినేపల్లి మండలం గంగారంతండాకు చెందిన చందు(42) అనే వ్యక్తి కొన్ని నెలలుగా మండల కేంద్రంలోని బొగ్గులబ ట్టీలో కూలీగా పని చేస్తున్నాడు. శనివారం రాత్రి ప్రమాదవశాత్తు విద్యుదాఘాతం తో మృతి చెందాడు. అతనికి భార్య, పిల్లలు ఉన్నారు.
Updated Date - 2021-07-25T04:06:16+05:30 IST