వచ్చేనెల 5లోగా దరఖాస్తు చేసుకోవాలి
ABN, First Publish Date - 2021-02-25T03:57:25+05:30
నూతన సాండ్ టా క్స్ పాలసీని ప్రభుత్వం ప్రవేశ పెట్టిందని, ఇసుకను రవాణ చేసేందుకు ఆసక్తి గల ట్రాక్టర్ యజమానులు వచ్చేనెల 5 లోగా దరఖాస్తు చేసుకోవాలని అదనపు కలెక్టర్ మనూచౌ దరి తెలిపారు.
నాగర్కర్నూల్ కలెక్టరేట్, ఫిబ్రవరి24: నూతన సాండ్ టా క్స్ పాలసీని ప్రభుత్వం ప్రవేశ పెట్టిందని, ఇసుకను రవాణ చేసేందుకు ఆసక్తి గల ట్రాక్టర్ యజమానులు వచ్చేనెల 5 లోగా దరఖాస్తు చేసుకోవాలని అదనపు కలెక్టర్ మనూచౌ దరి తెలిపారు. బుధవారం కలెక్టరేట్ సమావేశమందిరంలో ట్రాక్టరు యాజమానులతో అదనపు కలెక్టర్ మాట్లాడారు. మన ఇసుక మన వాహనం కార్యక్రమాన్ని చేపడుతున్నామ ని తెలిపారు. ఇసుక సప్లై చేసే ట్రాక్టర్ యజమానులు త ప్పనిసరిగా ప్రభుత్వానికి రూ.25వేల డిపాజిట్ చేసుకోవాల ని తెలిపారు. కార్యక్రమంలో కలెక్టరేట్ అధికారులు, టెక్నికల్ సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - 2021-02-25T03:57:25+05:30 IST