వచ్చే ఎన్నికల్లో 78 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ విజయం: మాణిక్కం ఠాగూర్
ABN, First Publish Date - 2021-10-31T21:09:14+05:30
2023 ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా 78 అసెంబ్లీ స్థానాలను కైవసం....
మహబూబ్ నగర్ జిల్లా: 2023 ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా 78 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంటుందని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆదివారం ఇక్కడ జరిగిన పార్లమెంటరీ నియోజకవర్గ సమావేశంలో పాల్గొన్న ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అరాచకాలు, అక్రమ కేసులపై కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. దేశంలో, రాష్ట్రంలో పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలపై.. అలాగే రాష్ట్రంలో జరుగుతున్న దోపిడీ, అరాచకాలపై నవంబర్ 14వ తేదీ నుంచి 21 వరకు 7 రోజుల పాటు నారాయణపేటలో జనజాగరణ పేరుతో జిల్లా, మండల స్థాయిలో పాదయాత్ర చేపడతామన్నారు. నవంబర్ 1 నుంచి గాంధీ భవన్లో డిజిటల్ మెంబర్ షిప్ నమోదు కార్యక్రమం నిర్వహిస్తామని మాణిక్కం ఠాగూర్ తెలిపారు.
Updated Date - 2021-10-31T21:09:14+05:30 IST