20వ తేదీ వరకు మక్తల్లో లాక్డౌన్
ABN, First Publish Date - 2021-05-09T04:16:23+05:30
మక్తల్ నియోజకవర్గ కేంద్రం లో రోజు రోజుకు పెరుగుతున్న కరోనా కేసులను దృష్టిలో ఉంచుకొని ఈనెల 20వతేదీ వరకు లాక్డౌన్ విధిస్తున్నట్లు ఎమ్మెల్యే చిట్టెం రామ్మో హన్రెడ్డి తెలిపారు.
మక్తల్, మే 8 : మక్తల్ నియోజకవర్గ కేంద్రం లో రోజు రోజుకు పెరుగుతున్న కరోనా కేసులను దృష్టిలో ఉంచుకొని ఈనెల 20వతేదీ వరకు లాక్డౌన్ విధిస్తున్నట్లు ఎమ్మెల్యే చిట్టెం రామ్మో హన్రెడ్డి తెలిపారు. 1వ తేదీ నుంచి ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1గంటల వరకు దుకా ణాలు తెరిచి ఉంచుతున్నారు. ఇదే నిర్ణయాన్ని ఈనెల ఈనెల 20వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు తెలిపారు. ఆల్మర్చంట్ అసోసియేషన్ సభ్యుల సహకారాన్ని ఆయన ప్రశంసించారు. కరోనా కట్టడికి వ్యాపారుల కృషి అభినందనీయమన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి కరోనా బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా ప్రతి ఒక్కరు మాస్కులు ధరించి భౌతిక దూరం పాటిస్తూ వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాదాన్యత ఇవ్వాలన్నారు.
Updated Date - 2021-05-09T04:16:23+05:30 IST