పకడ్బందీగా కర్ఫ్యూ అమలు
ABN, First Publish Date - 2021-05-06T04:47:59+05:30
Armored curfew enforcement
- వీసీలో ఎస్పీ రావిరాల వెంకటేశ్వర్లు
మహబూబ్నగర్, మే 5: జిల్లాలో నైట్ కర్ఫ్యూను పకడ్బందీగా నిర్వహిస్తున్నామని ఎస్పీ రావిరాల వెంకటేశ్వర్లు తెలిపారు. బుధ వారం హైదరాబాద్ నుంచి డీజీపీ మహేందర్ రెడ్డి పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో అమ లు అవుతున్న నైట్ కర్ఫ్యూ గురించి డీజీపీ ఆరా తీశారు. కర్ఫ్యూ నిబంధనలు కఠినంగా అమలు చేయాలని, అప్పుడే లక్ష్యం నెరవేరు తుందని ఆదేశించారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చినా, మాస్కులు ధరించకపోయినా చర్యలు తీసుకోవాలన్నారు. కరోనా కట్టడి కోసం పో లీసులు మరింత బాధ్యతాయుతంగా పని చే యాలని అన్నారు. ఎస్పీ రావిరాల మాట్లాడు తూ కరోనా వ్యాప్తి, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పోలీసు సురక్ష కళాజాత బృందాలతో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. పోలీస్స్టేషన్ల వారిగా పెట్రోలింగ్ బృందాలను నియమించామని, పోలీస్ కు టుంబాలకు వ్యాక్సిన్ వేయించడంతోపాటు టీకా ఆవశ్యకతపై ప్రజలకు పెద్దఎత్తున అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. సమావేశంలో ఎస్పీ అడ్మిన్ ఎన్ వెంకటేశ్వర్లు ఉన్నారు.
Updated Date - 2021-05-06T04:47:59+05:30 IST