ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైల్లో నుంచి కింద పడి వ్యక్తికి గాయాలు

ABN, First Publish Date - 2021-05-09T04:20:54+05:30

ప్రమాదవశాత్తు రైలులో నుంచి జారిపడి తీవ్ర గాయాలనైన సంఘటన కృష్ణ మండల కేంద్రంలోని రైల్వే స్టేషన్‌లో చేటు చేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కృష్ణ, మే 8 : ప్రమాదవశాత్తు రైలులో నుంచి జారిపడి తీవ్ర గాయాలనైన సంఘటన కృష్ణ మండల కేంద్రంలోని రైల్వే స్టేషన్‌లో చేటు చేసుకుంది. రైల్వే ఎస్సై రాఘవేందర్‌ గౌడ్‌ తెలిపిన వివరాల ప్రకారం... రాయిచూర్‌ జిల్లా కేంద్రానికి చెందిన లోకప్ప,(50) పుణె నుంచి రాయిచూర్‌ వెళ్తుండగా కృష్ణ రైల్వే స్టేషన్‌లో రైలు ఆగింది. నిద్రమత్తులో ఉన్న లోకప్ప రాయిచూర్‌ రైల్వే సేషన్‌ అనుకొని రైలు కదులుతుండగా దిగబోయే సమయంలో ప్రమాదవశాత్తు రైలు కింద పడ్డాడు. గమనించిన తోటి ప్రయాణికులు లోకప్పను పైకి లాగడంతో రెండు కాళ్ళ పాదాలు తొలగిపోయాయి. రైల్వే పోలీసులు అంబులెన్స్‌ ద్వారా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారని ఎస్సై తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామని ఎస్సై తెలిపారు. 



ధన్వాడలో గుర్తు తెలియని మహిళ శవం లభ్యం


ధన్వాడ, మే 8 : ధన్వాడలో శనివారం గుర్తు తెలియని మహిళ శవం లభ్యమైంది. కొండాపూర్‌ రహదారిలోని అప్పంపల్లి శ్రీనివాస్‌రెడ్డి పొలంలో 50ఏళ్ల వయస్సు గల మహిళ శవం లభ్యమైం ది. మరికల్‌ సీఐ శివకుమార్‌, ధన్వాడ ఎస్‌ఐ రాజేందర్‌ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన మహిళ గురించి అన్ని స్టేషన్‌లకు సమాచారం ఇచ్చినట్లు సీఐ తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని, సంఘటనపై కేసు నమోదు చేసుకొని  దర్యాప్తు చేస్తున్నామని సీఐ విలేకరులకు తెలిపారు. 

Updated Date - 2021-05-09T04:20:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising