ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతు ఆత్మహత్య

ABN, First Publish Date - 2021-08-26T04:57:53+05:30

చేసిన అప్పులు తీర్చలేనన్న మనస్తాపంతో హన్వాడ మండలం పల్గుతండాకు చెందిన కాట్రావత్‌ నాన్యనాయక్‌(37) బుధవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అప్పుల బాధలే కారణం

రెండెకరాలు కౌలుకు తీసుకొని పత్తి సాగు


జడ్చర్ల, ఆగస్టు 25: చేసిన అప్పులు తీర్చలేనన్న మనస్తాపంతో హన్వాడ మండలం పల్గుతండాకు చెందిన కాట్రావత్‌ నాన్యనాయక్‌(37) బుధవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జడ్చర్ల సీఐ వీరస్వామి వివరాల ప్రకారం.. నాన్యనాయక్‌ తండాలలో కొందరి వద్ద అప్పు చేసి, ఐదేళ్ల కిందట పని కోసం సౌదీఅరేబియాకు వెళ్లాడు. అక్కడా పని దొరకక గత సంవత్సరం తిరిగి వచ్చాడు. జడ్చర్ల మండలం ఆలూరు సమీపంలో రెండు ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని పత్తి పంట వేశాడు. పంట సరిగా లేకపోవడంతో ఐదేళ్ల కిందట చేసిన అప్పులు, తాజాగా పంట కోసం చేసిన అప్పులు తీర్చలేనన్న మనస్తాపంతో కౌలుకు తీసుకున్న పొలంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. నాన్యనాయక్‌ భార్య కాట్రావత్‌లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తులో ఉంది.

Updated Date - 2021-08-26T04:57:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising