ప్రతీ మొక్కను బతికించాలి : కలెక్టర్
ABN, First Publish Date - 2021-03-06T05:02:41+05:30
హరితహారంలో రోడ్ల వెంబడి నాటిన ప్రతి మొక్కను బతికించుకోవాలని కలెక్టర్ యాస్మిన్ బాషా అన్నారు. శుక్రవారం ఆమె పట్టణంలోని నర్సరీలను పరిశీలించి మొక్కల వివరాలను తెలుసుకు న్నారు.
అర్బన్, మార్చి 5: హరితహారంలో రోడ్ల వెంబడి నాటిన ప్రతి మొక్కను బతికించుకోవాలని కలెక్టర్ యాస్మిన్ బాషా అన్నారు. శుక్రవారం ఆమె పట్టణంలోని నర్సరీలను పరిశీలించి మొక్కల వివరాలను తెలుసుకు న్నారు. నర్సరీలలో ఫెల్టోఫామ్, జామ, దానిమ్మ, పారిజాతం లాంటి రకాలై న మొక్కలను పెంచాలని సూచించారు. అలాగే పాతకోటలోని రెండో నర్సరీలో మొక్కలను పరిశీలించారు. మునిసిపాలిటీ అర్బన్ పరిధిలోని నరసింగపల్లి నర్సరీలో మొక్కలను పెంచాలన్నారు. ఈ సందర్భంగా రోడ్ల వెంట నాటిన మొక్కలను చూసి జిల్లా కలెక్టర్ మునిసిపల్ కమిషనర్పై అసహనం వ్యక్తం చేశారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని ప్రతిరోజు మొక్క లకు నీరు పోయాలని సూచించారు.
Updated Date - 2021-03-06T05:02:41+05:30 IST