ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దౌదర్‌పల్లి ప్లాట్ల జోలికి రావొద్దు

ABN, First Publish Date - 2021-12-08T05:03:41+05:30

దౌదర్‌పల్లి దర్గా వద్ద ప్రభుత్వం ఇచ్చిన ప్లాట్లజోలికి రావద్దంటూ లబ్ధిదారులు మంగళవారం కూడా ధర్నా చేశారు.

దౌదర్‌పల్లి దర్గా వద్ద ధర్నా చేస్తున్న లబ్ధిదారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- లబ్ధిదారుల డిమాండ్‌ 

- రెండో రోజు కొనసాగిన ధర్నా

గద్వాల రూరల్‌, డిసెంబరు 7 : దౌదర్‌పల్లి దర్గా వద్ద ప్రభుత్వం ఇచ్చిన ప్లాట్లజోలికి రావద్దంటూ లబ్ధిదారులు మంగళవారం కూడా ధర్నా చేశారు. ప్రభుత్వం పేదలకు పట్టాలు పంపిణీ చేసిన భూమిలో నర్సింగ్‌ కాలేజీ నిర్మాణానికి సన్నాహాలు చేస్తుండడంతో లబ్ధిదారులు సోమవారం ఆందోళన చేప ట్టారు. అధికారుల నుంచి సానుకూల స్పం దన రాకపోవడంతో రెండవ రోజు కూడా ధర్నా చేశారు. బీజేపీ నాయకులు బండల వెంకట్రాములు, రామాంజనేయులు, డిటీడీసీ నర్సింహ తదితరులు వారికి మద్దతు తెలిపారు. ఈ సందర్బంగా లబ్ధిదారులు మాట్లాడుతూ డీకే అరుణ మంత్రిగా ఉన్నప్పుడు ప్లాట్లను పంపిణీ చేశారని, టీఆర్‌యస్‌ ప్రభు త్వం వచ్చిన తర్వాత రుణాలు మంజూరు చేయకపోవడంతో ఇళ్ల నిర్మాణం చేపట్టలేదని తెలిపారు. డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు ఇస్తానని చెప్పిన ప్రభుత్వం, ఇచ్చిన జాగాను కూడా లాక్కోవడం సమంజసం కాదన్నారు. సమా చారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని నచ్చచెప్పారు.


Updated Date - 2021-12-08T05:03:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising