ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముహూర్తం దాటినా సిద్ధంకాని ధ్వజమేఖలం

ABN, First Publish Date - 2021-07-25T04:24:02+05:30

ఆగమ సంప్రదాయాలకు విరుద్ధంగా అలంపూరు క్షేత్రంలో జీవధ్వజ కలశం, మేఖలాలను తొలగించిన అధికా రులు పాపభీతితో చేసిన దిద్దుబాటు చర్యలు ఫలించలేక పోయాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- నేటికి వాయిదా వేసిన అధికారి 

అలంపూరు, జూలై 24 : ఆగమ సంప్రదాయాలకు విరుద్ధంగా అలంపూరు క్షేత్రంలో జీవధ్వజ కలశం, మేఖలాలను తొలగించిన అధికా రులు పాపభీతితో చేసిన దిద్దుబాటు చర్యలు ఫలించలేక పోయాయి. మేఖళాలు, కలశానికి శనివారం ఉదయం కళాన్యాసం జరగాల్సి ఉండగా సాయంత్రం 5గంటల దాకా కూడా ధ్వజస్థంభంపై బిగించలేకపోయారు. కళాన్యాసం చేసేందుకు పండితులు అన్నీ సిద్ధం చేసుకుని హోమాలు కూడా ముగించారు. అయినప్పటికీ మేఖలాలు, కలశం బిగించక పోవడంతో మధ్యాహ్నం 1గంట దాకా ఎదురుచూసిన అర్చకులు వెళ్లిపో యారు. ఈనెల 24న జీవ ధ్వజానికి కళాన్యాసం ఉంటుందని ధర్మకర్తలంతా రావాలంటూ పాలకమండలికి సమాచారం ఇచ్చి తీరా కార్యక్రమాన్ని పూర్తి చేయలేకపోవడం సర్వత్రా చర్చనీయాంశంమైంది. ఎట్టకేలకు ఆదివారం ఉదయానికి కార్యక్రమాన్ని వాయిదా  వేయడంతో భక్తులు అవాక్కయ్యారు. ఈ విషయమై ఆలయ ఈవో పేమ్‌కుమార్‌ను వివరణ కోరగా ఆలస్యం జరిగిన మాట వాస్తవమే అన్నారు. చేసే పని పకడ్బందీగా చేయాలనే సంకల్పంతో కొంత ఆలస్యం అయిందన్నారు.


Updated Date - 2021-07-25T04:24:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising