రేపు అలంపూర్ ఆలయాల మూసివేత
ABN, First Publish Date - 2021-03-07T04:38:09+05:30
అలంపూర్ ఆలయాలను సోమవారం మూసివేస్తున్నట్టు చైర్మన్ రవిప్రకాష్గౌడ్, ఈఓ ప్రేమ్కుమార్లు తెలిపారు.
అలంపూర్, మార్చి 6: అలంపూర్ ఆలయాలను సోమవారం మూసివేస్తున్నట్టు చైర్మన్ రవిప్రకాష్గౌడ్, ఈఓ ప్రేమ్కుమార్లు తెలిపారు. జోగుళాంబ, బాల బ్రహ్మేశ్వర స్వామి దేవస్ధానాల్లో సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ఆలయ శుద్ధి కార్యక్రమం ఉంటుందని, ఆలయ తలుపులు మూసి ఆలయశుదిధ పవిత్రోత్సవం నిర్వహిస్తామని అన్నారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఈ నెల 10నుంచి 14వరకు నిర్వహిస్తున్నందున ఆలయాలు మూసివేసి శుద్ధి చేస్తామని చెప్పారు. అదేరోజు సాయంత్రం 6.30 నుండి భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తామని చెప్పారు. ఈ నెల 10న మహా శివరాత్రి సందర్భంగా ధ్వజారోహణం, 12న కల్యాణోత్సవం, రాత్రి ఏడుగంటలకు రథోత్సవం, 14న ఆదివారం 11గంటలకు అవ్వబృదోత్సవం పూజలు ఉంటాయన్నారు. భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నట్లు ఆల య చైర్మన్ రవిప్రకాష్గౌడ్, ఈఓ ప్రేమ్కుమార్ తెలిపారు. 8న బాలబ్రహ్మేశ్వర స్వామి బెలూన్ ఆవిష్కరణ ఉంటుందని చైర్మన్ రవిప్రకాష్గౌడ్ తెలిపారు.
Updated Date - 2021-03-07T04:38:09+05:30 IST