అదనపు కలెక్టర్ ఆకస్మిక పర్యటన
ABN, First Publish Date - 2021-10-22T05:46:00+05:30
మండల పరిధిలోని కల్లేపల్లి, ఈద్గాన్పల్లి గ్రామాల్లో గురువా రం జిల్లా అదనపు కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్ ఆకస్మికంగా పర్యటించారు.
రాజాపూర్, అక్టోబరు 21 : మండల పరిధిలోని కల్లేపల్లి, ఈద్గాన్పల్లి గ్రామాల్లో గురువా రం జిల్లా అదనపు కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్ ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో పల్లెప్రకృతి వనాలు, డంపింగ్ యార్డులు, శ్మశాన వాటికలను పరిశీలించారు. నర్సరీలలో ఉన్న మొక్కలను ప్రత్యేకంగా పరిశీలించారు. ఎలాంటి పనులు చేస్తున్నారో కూలీలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో లక్ష్మీదేవి, ఎంపీవో వెంకట్రాములు, ఏపీవో భారతి, ఆయా గ్రామ పంచాయతీల కార్యదర్శులు పాల్గొన్నారు.
Updated Date - 2021-10-22T05:46:00+05:30 IST