పారిశుధ్యం పనులు చేపట్టాలి
ABN, First Publish Date - 2021-05-11T04:53:27+05:30
మునిసిపాలిటీలోని అన్ని వార్డులో నిత్యం పారిశుధ్య పనులు చేపట్టాలని, పరిసరాలను శుభ్రంగా ఉంచాలని అదనపు కలెక్టర్ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు.
- అదనపు కలెక్టర్ శ్రీహర్ష
- జిల్లా కేంద్రంలోని 2, 4, 5 వార్డుల్లో పర్యటన
గద్వాల, మే 10 (ఆంధ్రజ్యోతి) : మునిసిపాలిటీలోని అన్ని వార్డులో నిత్యం పారిశుధ్య పనులు చేపట్టాలని, పరిసరాలను శుభ్రంగా ఉంచాలని అదనపు కలెక్టర్ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. మునిసిపాలిటీలోని రెండు, నాలుగు, ఐదు వార్డుల్లో సోమవారం ఆయన పర్యటించారు. వార్డులో అక్కడక్కడా పేరుకుపోయిన చెత్తచెదారాన్ని ఎక్స్కవేటర్తో తీసివేయించారు. స్థానికులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం కరోనా విజృంభిస్తోందని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతీ ఒక్కరూ కొవిడ్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని చెప్పారు. ఆయన వెంట కమిషనర్ శ్రీనివాసరెడ్డి ఉన్నారు.
Updated Date - 2021-05-11T04:53:27+05:30 IST