mahabubabad: రెండు లక్షలను కొరికిపడేసిన ఎలుకలు
ABN, First Publish Date - 2021-07-17T14:46:51+05:30
మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని చంద్రునాయక్ తండాలో ఎలుకల కలకలం రేగింది.
మహబూబాబాద్: మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని చంద్రునాయక్ తండాలో ఎలుకల కలకలం రేగింది. రెడ్యానాయక్ అనే కూరగాయల వ్యాపారికి చెందిన రెండు లక్షల రూపాయలను ఎలుకలు కొరికిపడేశాయి. దీంతో బాధితుడు లబోదిబోమంటు బ్యాంకుల చుట్టూ తిరిగాడు. అయితే హైదరాబాద్ ఆర్బీఐకు వెళ్లాలని బ్యాంకు అధికారులు సూచించారు.
Updated Date - 2021-07-17T14:46:51+05:30 IST