అనవసరంగా రోడ్లపైకి వచ్చిన వారిపై చర్యలు
ABN, First Publish Date - 2021-05-21T20:07:05+05:30
ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రశాంతంగా కొనసాగుతోంది.
ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రశాంతంగా కొనసాగుతోంది. నిబంధనలను పోలీసులు పకడ్భందిగా అమలు చేస్తూ.. అనవసరంగా రోడ్లపైకి వచ్చినవారిపై దృష్టి సారిస్తున్నారు. ఇప్పటికే లాక్ డౌన్ నిబంధనల ఉల్లంఘనలపై 10 వేల కేసులు నమోదు చేశారు. నాలుగు గంటల సడలింపులో ప్రజలు గుంపులు గుంపులుగా రోడ్లపైకి వస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా రోజుకు 15 వందల వరకు పాజిటీవ్ కేసులు నమోదవుతున్నాయి. రోజుకు 10 నుంచి 15 మంది మరణిస్తున్నారు. అలాగే బ్లాక్ ఫంగస్ కేసులు కూడా నమోదవుతున్నాయి. దీంతో ఉమ్మడి నల్గొండ జిల్లాలో లాక్ డౌన్ను పటిష్టంగా అమలు చేస్తున్నారు.
Updated Date - 2021-05-21T20:07:05+05:30 IST