ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణలో లిక్కర్‌ మాఫియాదే రాజ్యం

ABN, First Publish Date - 2021-01-20T08:09:19+05:30

తెలంగాణలో లిక్కర్‌ మాఫియా రాజ్యమేలుతోందని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్‌ ఛుగ్‌ ఆరోపించారు. మాఫియా డాన్‌కు కేసీఆర్‌ అధికారిక నివాసం అడ్డా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీజేపీ రాష్ట్ర ఇన్‌చార్జి తరుణ్‌ ఛుగ్‌ 


హైదరాబాద్‌, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో లిక్కర్‌ మాఫియా రాజ్యమేలుతోందని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్‌ ఛుగ్‌ ఆరోపించారు. మాఫియా డాన్‌కు కేసీఆర్‌ అధికారిక నివాసం అడ్డా అయిందని, ఆ మాఫియా ప్రభుత్వంలో ఒక భాగమైందని విమర్శించారు. మంగళవారం బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతామూర్తి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తరుణ్‌ఛుగ్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేస్తామని అధికారంలోకి వచ్చిన సీఎం కేసీఆర్‌, మద్యనిషేధం అమల్లో విఫలమయ్యారన్నారు. తెలంగాణాలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, మహిళా స్వయం సహాయక సంఘాలను ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. తెలంగాణ ఏర్పాటు ఘనత బీజేపీ కార్యకర్తలదే అని, దివంగత నేత వనం ఝాన్సీ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారని కొనియాడారు. బాగున్నారా అంటూ తెలుగులో మహిళా నేతలను పలుకరించిన తరుణ్‌ ఛుగ్‌.. తెలంగాణాలో ఒక లంక ఉందని, ఆ లంకా దహనంలో మహిళలంతా కీలకపాత్ర పోషించాలని అన్నారు. కేసీఆరే బూతుల ముఖ్యమంత్రి అని బీజేపీ నాయకురాలు విజయశాంతి ఆరోపించారు. 

Updated Date - 2021-01-20T08:09:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising