మన రాజ్యాన్ని మనమే ఏలుకుందాం: వంగపల్లి
ABN, First Publish Date - 2021-02-27T08:43:48+05:30
‘మన ఓట్లను మనకే వేసుకుందాం-మన రాజ్యాన్ని మనమే ఏలుకుందాం’ అనే నినాదంతో రాష్ట్రంలో ‘దళిత బహుజన అభ్యుదయ సేన’ను ఏర్పాటు చేస్తున్నామని ఆ సేన వైస్ చైర్మన్ వంగపల్లి శ్రీనివాస్ తెలిపారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): ‘మన ఓట్లను మనకే వేసుకుందాం-మన రాజ్యాన్ని మనమే ఏలుకుందాం’ అనే నినాదంతో రాష్ట్రంలో ‘దళిత బహుజన అభ్యుదయ సేన’ను ఏర్పాటు చేస్తున్నామని ఆ సేన వైస్ చైర్మన్ వంగపల్లి శ్రీనివాస్ తెలిపారు. శనివారం హైదరాబాద్లో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్టు వివరించారు. పూలే, అంబేడ్కర్, పెరియార్, కాన్షీరాం వంటి ఎందరో మహానీయులు అణగారిన ప్రజలకు రాజ్యాధికార అవసరాన్ని నొక్కి చెప్పారని అందుకోసం జీ వితాంతం కృషి చేశారన్నారు. నమ్మి అధికారాన్ని కేసీఆర్ చేతిలో పెడితే దళితుల బతుకులను బీజేపీ చేతుల్లో పెడుతున్నారని ఆరోపించారు.
Updated Date - 2021-02-27T08:43:48+05:30 IST