పోలేపల్లి ఎల్లమ్మపై ఒట్టేసి చెప్పగలవా.. కేటీఆర్కు రేవంత్ సవాల్
ABN, First Publish Date - 2021-01-24T21:40:42+05:30
అవే పథకాలకు రంగులు వేసి ‘గుమస్తా తెలంగాణ’ రాసిన రాతలు పచ్చి అబద్ధాలంటూ
ఇంటర్నెట్ డెస్క్: కొడంగల్ అభివృద్ధిపై రాష్ట్ర మంత్రి కేటీఆర్ను ఉద్దేశిస్తూ మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. కొడంగల్ అభివృద్ధైనా, ఆత్మగౌరవమైనా తను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే (2009-2018) జరిగిందని ట్విట్టర్లో పేర్కొన్నారు. ‘నా’టి పథకాలు అంటూ ‘నా’ అనే అక్షరాన్ని ప్రత్యేకించి చెబుతూ తనదైన శైలిలో ట్వీట్ చేశారు. అవే పథకాలకు రంగులు వేసి ‘గుమస్తా తెలంగాణ’ రాసిన రాతలు పచ్చి అబద్ధాలంటూ జీవోలతో సహా పోస్ట్ చేశారు. ‘నీ దత్తతలో (జనవరి 2019 తర్వాత) ఒక్క పథకమైనా వచ్చినట్టు పోలేపల్లి ఎల్లమ్మపై ఒట్టేసి ఆధారం (జీవో) చూపగలవా...!? కేటీఆర్’ అంటూ సవాల్ చేశారు.
Updated Date - 2021-01-24T21:40:42+05:30 IST